శ్రీబాగ్ ఒప్పందం అమలు కోసం మార్చ్ఫాస్ట్
ABN , First Publish Date - 2021-11-16T21:25:05+05:30 IST
ఆంధ్రరాష్ట్ర అవతరణ సమయంలో జరిగిన శ్రీబాగ్ ఒప్పందాన్ని
కర్నూలు: ఆంధ్రరాష్ట్ర అవతరణ సమయంలో జరిగిన శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని రాయలసీమ విద్యార్థి సంఘాల నాయకులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. కర్నూలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని రాయలసీమ విద్యార్థి జేఏసీ నేత కోనేటి వెంకటేశ్వర్లు కోరారు.
అలాగే శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలంటూ ఎస్టీయూ భవన్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.