72 అడుగుల జెండాతో మార్చ్‌పాస్ట్‌

ABN , First Publish Date - 2021-01-27T06:30:03+05:30 IST

మండలంలోని కుసర్లపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు 72 అడుగుల జాతీయ జెండాతో మార్చ్‌పాస్ట్‌ నిర్వహించారు.

72 అడుగుల జెండాతో మార్చ్‌పాస్ట్‌
72 అడుగుల జాతీయ జెండాతో మార్చ్‌పాస్ట్‌ చేస్తున్న విద్యార్థులు

రోలుగుంటలో విద్యార్థుల ప్రదర్శన


రోలుగుంట, జనవరి 26: మండలంలోని కుసర్లపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు 72 అడుగుల జాతీయ జెండాతో మార్చ్‌పాస్ట్‌ నిర్వహించారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హెచ్‌ఎం అచ్యుతం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రెవెన్యూ, మండల పరిషత్‌ కార్యాలయాల్లో తహసీల్దార్‌ కృష్ణమూర్తి, ఎంపీడీవో కె.ప్రభాకరరావు జాతీయ జెండాను ఎగరవేశారు.


Updated Date - 2021-01-27T06:30:03+05:30 IST