72 అడుగుల జెండాతో మార్చ్పాస్ట్
ABN , First Publish Date - 2021-01-27T06:30:03+05:30 IST
మండలంలోని కుసర్లపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 72 అడుగుల జాతీయ జెండాతో మార్చ్పాస్ట్ నిర్వహించారు.
రోలుగుంటలో విద్యార్థుల ప్రదర్శన
రోలుగుంట, జనవరి 26: మండలంలోని కుసర్లపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 72 అడుగుల జాతీయ జెండాతో మార్చ్పాస్ట్ నిర్వహించారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హెచ్ఎం అచ్యుతం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాల్లో తహసీల్దార్ కృష్ణమూర్తి, ఎంపీడీవో కె.ప్రభాకరరావు జాతీయ జెండాను ఎగరవేశారు.