గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2021-06-08T00:36:57+05:30 IST
జిల్లా గుండా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు
భద్రాద్రి: జిల్లా గుండా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం డీఆర్పీఎఫ్ క్యాంప్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలను పోలీసులు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒడిశా నుంచి మిర్యాలగూడకు కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ దాదాపు 30 లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.