నేటి నుంచి మార్కాపురంలో యథావిధిగా కూరగాయల విక్రయాలు
ABN , First Publish Date - 2020-07-06T10:29:19+05:30 IST
పట్టణంలో సోమవారం నుంచి కూరగాయల విక్రయాలు యథావిధిగా జరుగనున్నాయి.
మార్కాపురం, జూలై 5: పట్టణంలో సోమవారం నుంచి కూరగాయల విక్రయాలు యథావిధిగా జరుగనున్నాయి. స్థానిక మార్కెట్ యార్డ్లో ఏ ర్పాటు చేసిన కూరగాయల వ్యాపారులను పోలీస్ అధికారి దుర్భాషలాడా డన్న కారణంతో 12 రోజులపాటు పట్టణంలో కూరగాయల విక్రయాలు ని లిపివేయాలని పట్టణ కూరగాయల అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం నిర్ణయించారు. ఈ నేపఽథ్యంలో మార్కాపురం శాసనసభ్యుడు కుందురు నా గార్జునరెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు కూరగాయల మార్కెట్ అసోసియే షన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. దీంతో సోమవారం నుంచి యఽథావిధిగా కూరగాయల విక్రయాలు చేపట్టాలని నిర్ణయించారు. వారంలో సోమ, మంగళ, గురు, శుక్రవారాలు మాత్రమే కూరగాయలు విక్రయించనున్నారు. పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు విక్రయాలను ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే చేయనున్నారు.