మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
ABN , First Publish Date - 2020-07-17T11:18:51+05:30 IST
మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని మార్కాపురం జిల్లా సాధన కన్వీనర్ పీఎల్పీ యాదవ్ అన్నారు.
మార్కాపురం(వన్టౌన్), జూలై 16: మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని మార్కాపురం జిల్లా సాధన కన్వీనర్ పీఎల్పీ యాదవ్ అన్నారు. గురువారం స్థానిక కంభం రోడ్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాటానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర స హాయ కార్యదర్శి షంషీర్ ఆలీబేగ్, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు కె. రామకృ ష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.