ఎరువుల కొనుగోలుకు నోడల్ ఏజెన్సీగా మార్క్ఫెడ్ నియామకం
ABN , First Publish Date - 2020-04-09T23:09:00+05:30 IST
తెలంగాణలో ఎరువుల కొనుగోలు, పంపిణీ ప్రక్రియలు నిర్వహించడానికి తెలంగాణ మార్క్ఫెడ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో ఎరువుల కొనుగోలు, పంపిణీ ప్రక్రియలు నిర్వహించడానికి తెలంగాణ మార్క్ఫెడ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఎరువుల వినియోగం, వాటి నిల్వలను కూడా మార్క్ఫెడ్ పర్యవేక్షణ చేయనుంది. 2020-21 సంవత్సరానికి మార్క్ఫెడ్ ఈ కార్యకలాపాలునిర్వహించనుంది. వ్యవసాయినికి అవసరమైన 4లక్షల మెట్రిక్టన్నుల బఫర్స్టాక్ను నిల్వచేయడం, 0.30 మెట్రిక్టన్నుల డీఏపీ, 0.70 లక్షల మెట్రిక్టన్నుల కాంప్లెక్స్, మరో 3లక్షల మెట్రిక్న్ను యూనియాను జిల్లాల వారీగా అవసరానలు గుర్తించి బఫర్స్టాక్ను నిల్వచేసేందుకు ప్రభుత్వ జారా చేసిన ఉత్తర్వుల్లో ఆదేశించారు. తెలంగాణ మార్క్ఫెడ్కు 500 కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వ గ్యారంటీని కల్పించింది. ఈ నిధుల ద్వారా 4లక్షల మెట్రిక్టన్నుల ఫెర్టిలైజర్స్స్టాక్, బఫర్స్టాక్ స్టాక్ మెయింటెయిన్చేయనుంది. రాష్ట్రంలో ఎరువుల కొరత రాకుండా మార్క్ఫెడ్ స్టాక్ను నిల్వచేసి ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా వాటిని సరఫరా చేయనుంది.