ఫేస్ప్యాక్తో మచ్చలు మాయం
ABN , First Publish Date - 2020-10-05T05:30:00+05:30 IST
సెనగపిండి- పావు కప్పు, గ్రీన్ టీ పొడి- రెండు టీ స్పూన్లు, పసుపు పొడి- ఒక టేబుల్ స్పూన్, బియ్యప్పిండి- పావు కప్పు తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి, గ్రీన్ టీ పొడి వేసి కలపాలి...
సెనగపిండి- పావు కప్పు, గ్రీన్ టీ పొడి- రెండు టీ స్పూన్లు, పసుపు పొడి- ఒక టేబుల్ స్పూన్, బియ్యప్పిండి- పావు కప్పు తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి, గ్రీన్ టీ పొడి వేసి కలపాలి. తరువాత పసుపు పొడి, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా రోజ్వాటర్ వేస్తే, పేస్ట్లా తయారవుతుంది.
ఈ పేస్ట్ను గాలి చొరబడని సీసాలో వేయాలి. రాత్రిపూట కొద్దిగా ఈ పేస్ట్ తీసుకొని, కొద్దిగా రోజ్వాటర్ కలిపి మెటిమలు, మచ్చలు ఉన్నచోట రాసుకోవాలి.
రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే చల్లని నీళ్లతో ముఖం కడుక్కోవాలి. రోజూ ఇలా చేస్తే ఫలితం మొటిమలు, మచ్చలు తగ్గి కాంతిమంతంగా మారుతుంది.