అనేక అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం: శశిధర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-10-30T19:16:14+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికలో అనేక అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని..

అనేక అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం: శశిధర్‌రెడ్డి

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికలో అనేక అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి చేటుగా ఇక్కడి నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిబంధనల ప్రకారం జరగడం లేదన్నారు. డబ్బు, మద్యం పంచాలని టీఆర్ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని శశిధర్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2020-10-30T19:16:14+05:30 IST