అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ABN , First Publish Date - 2021-05-08T04:58:17+05:30 IST

సవరవల్లి గ్రామానికి చెందిన సవరవల్లి లక్ష్మి(40) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందా రు.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

భోగాపురం, మే7: సవరవల్లి గ్రామానికి చెందిన సవరవల్లి లక్ష్మి(40) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందా రు. ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మి తన స్వగృహంలో గురువారం రాత్రి అపస్మారక స్థితిలో పడి ఉండడా న్ని గమనించిన కుటుంబ సభ్యులు, చికిత్స నిమిత్తం తగరపు వలస ఎన్‌ఆర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడే మృతి చెంది నట్టు తెలిపారు. దీనిపై మృతురాలి తండ్రి గుమ్మడి రాములు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మృతదేహంపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. క్లూస్‌ టీం వచ్చి వివరాలు సేకరించారని చెప్పారు. విచారణ వేగవంతం చేసి, దర్యాప్తు పూర్తి చేస్తామన్నారు. మృతురాలు లక్ష్మికి భర్త శ్రీనివాసరావు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

 

Updated Date - 2021-05-08T04:58:17+05:30 IST