వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-06-20T06:39:45+05:30 IST

ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎంఆర్‌పల్లె ఎస్‌ఐ నరసింహ తెలిపిన వివరాల మేరకు..

వివాహిత ఆత్మహత్య
జ్యోతి మృతదేహం

తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 19: ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎంఆర్‌పల్లె ఎస్‌ఐ నరసింహ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతికి చెందిన కృష్ణ (చేపలవ్యాపారి) కుటుంబం శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటోంది. ఈయన భార్య జ్యోతి(45) కొంతకాలంగా కడుపు, పంటి నొప్పులతో బాధ పడుతున్నారు. శుక్రవారం కూడా ఆమె ఈ నొప్పులతో ఇబ్బంది పడుతూనే రాత్రి 11గంటలకు కుటుంబీకులతో నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారి చూసేసరికి.. ఇంటి వరండాలోని రేకులకు అమర్చిన ఇనుప పైపునకు చున్నీతో ఉరేసుకుని కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

Updated Date - 2021-06-20T06:39:45+05:30 IST