వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-24T06:21:56+05:30 IST
జీవీఎంసీ 85వ వార్డు పరిధి ఫార్మాసిటీ పునరావాస కాలనీ లేమర్తిలో భర్తతో విభేధాల కారణంగా వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
అగనంపూడి, జనవరి 23: జీవీఎంసీ 85వ వార్డు పరిధి ఫార్మాసిటీ పునరావాస కాలనీ లేమర్తిలో భర్తతో విభేధాల కారణంగా వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. లేమర్తికి చెందిన దంపతులు ముమ్మన మల్లేశ్వరరావు, ముమ్మన వరలక్ష్మి(38) ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. ఇరువురూ ఫార్మాసిటీలో గల రెండు వేర్వేరు పరిశ్రమల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఇటీవల కుమార్తె చంద్రిక, కుమారుడు సాయి అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఆదివారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో వరలక్ష్మి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గుర్తించి కొన ఊపిరితో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం అగనంపూడి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. భర్త మల్లేశ్వరరావును దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.