అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-27T05:30:00+05:30 IST
అత్తింటివారి వేధింపులు భరించలేక వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
తూప్రాన్రూరల్, జనవరి 27: అత్తింటివారి వేధింపులు భరించలేక వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... ములుగు మండలం సింగాయపల్లికి చెందిన స్వాతి(27)కి ఘనపూర్కు చెందిన తుమ్మకిరణ్తో తొమ్మిదేళ్లక్రితం పెళ్లయింది. వీరికి కొడుకు, కూతురు సంతానం. కొంతకాలంగా స్వాతికి మామ, భర్త, కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన స్వాతి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ సురేశ్కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ చెప్పారు.