వివాహిత అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2021-02-25T04:58:07+05:30 IST
రూరల్ మండలం లింగితండాకు చెందిన వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు రూరల్ ఎస్ఐ బాల్రెడ్డి తెలిపారు.
నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి24: రూరల్ మండలం లింగితండాకు చెందిన వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు రూరల్ ఎస్ఐ బాల్రెడ్డి తెలిపారు. లింగితండా గ్రామానికి చెందిన జ్యోతి (28) అత్తగారింటిలో నుంచి వచ్చి కొద్ది నెలలుగా తమ తల్లిదండ్రుల వద్ద లింగితండాలో ఉంటోంది. మంగళవారం రాత్రి సమయంలో ఎవరూలేని సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఉండడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం వరకు తమతో ఉత్సాహంగా మాట్లాడిన జ్యోతి రాత్రి సమయంలో అనుమానస్పదంగా మృతిచెందడం పట్ల గ్రామాస్థులు అనుమానం వ్యక్తంచేశారు. రూరల్ పోలీసులు రాత్రి 2 గంటల సమయంలో గ్రామానికి వచ్చి యువతి మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాల్రెడ్డి తెలిపారు.