గృహిణి అదృశ్యం.. ఫోన్‌ చేయగా..

ABN , First Publish Date - 2021-05-13T14:20:48+05:30 IST

ఇంటి నుంచి బయటకు వెళ్లిన గృహిణి అదృశ్యమైంది. ఫోన్‌ చేయగా..

గృహిణి అదృశ్యం.. ఫోన్‌ చేయగా..

హైదరాబాద్/హైదర్‌నగర్‌ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన గృహిణి అదృశ్యమైంది. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన ప్రకారం...గుంటూరు జిల్లాకు చెందిన వాసుబాబు, భార్య లక్ష్మి(30) కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ వేర్వేరు చోట్ల ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు. గత నెల 30న వాసు సొంతవూరికి వెళ్లాడు. ఈ నెల 7న తిరిగి ఇంటికి రాగా భార్య ఇంటి వద్ద లేదు. ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. ఆమె పనిచేస్తున్న షాపింగ్‌ మాల్‌కు వెళ్లి విచారించగా ఏప్రిల్‌ 30 నుంచి విధులుకు రావడం లేదని చెప్పారు. స్నేహితులు, బంధువులను విచారించినా ఆచూకీలభించకపోవడంతో భర్త కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


Updated Date - 2021-05-13T14:20:48+05:30 IST