మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రం ప్రారంభం
ABN , First Publish Date - 2021-09-18T14:09:46+05:30 IST
తిరువళ్లూర్ జిల్లా గుమ్మిడి పూండిలో న్యూ మాంగ్స్ కుంగ్ఫూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కేంద్రం ప్రారంభమైంది. శుక్ర వారం జరిగిన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కోచ్ ఎంఎస్ రవికుమార్ నే
గుమ్మిడిపూండి(చెన్నై): తిరువళ్లూర్ జిల్లా గుమ్మిడి పూండిలో న్యూ మాంగ్స్ కుంగ్ఫూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కేంద్రం ప్రారంభమైంది. శుక్రవారం జరిగిన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కోచ్ ఎంఎస్ రవికుమార్ నేతృత్వం వహించగా, ముఖ్యఅతిథిగా ప్రముఖ నటుడు సుమన్ పాల్గొని ప్రారంభించారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే జ్ఞాపక శక్తితో పాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని సుమన్ అన్నారు. కార్యక్రమంలో ఎంఎన్కేఎఫ్వో ఆలిండియా జనరల్ సెక్రటరీ దినేష్శర్మ, స్పెషల్ ఇన్స్పెక్టర్ నవరత్నం, ఇళంగోవన్, గుణశేఖర్, తులసి, అరుళ్ తదితరులు పాల్గొన్నారు.