మరుగునపడిన స్వచ్ఛ సంకల్పం!
ABN , First Publish Date - 2021-12-06T06:07:47+05:30 IST
మరుగునపడిన స్వచ్ఛ సంకల్పం!
ఉయ్యూరు, డిసెంబరు 5 : క్లీన్ ఆంధ్రప్ర దేశ్ పథకంలో భాగంగా స్వచ్ఛ సంకల్పం పేరుతో తడి, పొడి చెత్త సేకరణ నిమిత్తం గ్రామ పంచా యతీలకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన వాహ నాలు వినియోగానికి నోచుకోక రోజుల తరబడి నిరుపయోగంగా ఉంటున్నాయి. మండలంలో గండిగుంట, పెదఓగిరాల, కాటూరు, కలువ పాముల గ్రామ పంచాయతీలకు తడి, పొడి చెత్త సేకరణకు క్లీన్ ఆంధ్రప్రదేశ్ వాహనాలు అంద జేశారు. గ్రామ పంచాయతీలకు ఇచ్చిన వాహనా లు ఉపయోగించే విధానాన్ని డెమో చేయకపోవడం, కొన్ని పంచాయతీలకు ట్రాక్టరు ఉన్న నేపథ్యంలో ఈ వాహనాలు రోజుల తరబడి నిరుపయోగంగా ఉంటున్నాయి.