పెరిగిన మారుతి సుజుకి కార్ల ధరలివీ...

ABN , First Publish Date - 2021-01-19T19:19:56+05:30 IST

మారుతి సుజుకి కార్ల ధరలు దేశవ్యాప్తంగా రూ. 34 వరకు పెరిగాయి. పెరిగిన ధరలు వెంటనే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని సంస్థ వెల్లడించింది. పెరిగిన ఉత్పాదక వ్యయాలే ధరల పెంపునకు కారణమని సంస్థ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలిలా ఉన్నాయి.

పెరిగిన మారుతి సుజుకి కార్ల ధరలివీ...

న్యూఢిల్లీ : మారుతి సుజుకి కార్ల ధరలు దేశవ్యాప్తంగా రూ. 34 వరకు పెరిగాయి. పెరిగిన ధరలు వెంటనే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని సంస్థ వెల్లడించింది. పెరిగిన ఉత్పాదక వ్యయాలే ధరల పెంపునకు కారణమని సంస్థ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


కరోనా నేపధ్యంలో డిసెంబరు నెలలో మారుతి కార్ల అమ్మకాలు 20 శాతం మేర పెరిగినట్టు సంస్థ ప్రకటించింది. మొత్తంగా చెప్పాలంటే ఈ ఏడాది కొత్త కారు కొనేవారు అదనంగా మరింత సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. కార్ల తయారీదారు ‘మారుతి సుజుకి’... పెంచిన ధరల వివరాలను అధికారిక జాబితాను పంచుకోకపోయినప్పటికీ, కొన్ని వివరాలు మాత్రం వెలువడ్డాయి. ఈ వివరాల ప్రకారం... మారుతి సుజుకి పెరిగిన కార్ల ధరల వివరాలిలా ఉన్నాయి.  


మారుతి సుజుకి టూర్ ఎస్ : రూ. 5,061 వరకు,

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో  : రూ.7,000 వరకు,

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా : రూ.10,000 వరకు,

మారుతి సుజుకి డిజైర్ : రూ. 12,500 వరకు,

మారుతి సుజుకి ఆల్టో 800 : రూ.14,000 వరకు,

మారుతి సుజుకి సెలెరియో : రూ.19,400 వరకు,

మారుతి సుజుకి వాగన్-ఆర్ : రూ.23,200 వరకు,

మారుతి సుజుకి ఈకో : రూ. 24,200 వరకు,

మారుతి సుజుకి స్విఫ్ట్ : రూ. 30,000 వరకు,

మారుతి సుజుకి ఎర్టిగా : రూ. 34,000 వరకు. 

Updated Date - 2021-01-19T19:19:56+05:30 IST