ప్రభుత్వోద్యోగులకు మారుతీ ఆఫర్
ABN , First Publish Date - 2020-10-19T05:45:14+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగుల కోసం మారుతీ సుజుకి లిమిటెడ్ ప్రత్యేక ఆఫర్ ప్రకటింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగుల కోసం మారుతీ సుజుకి లిమిటెడ్ ప్రత్యేక ఆఫర్ ప్రకటింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన ఎల్టీసీ వోచర్ల ద్వారా తమ కంపెనీ కార్లు కొనుగోలు చేస్తే ఆయా వాహనాలను బట్టి, రూ.11,000 వరకు అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని తెలిపింది.
ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ ఆఫర్ కింద అందిస్తున్న ప్రయోజనాలకు ఇది అదనమని పేర్కొంది. డీలర్ల షోరూమ్స్తో పాటు ఎరినా, నెక్సా షోరూమ్స్కూ ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.