అద్దె ఇవ్వలేదని గ్రామ సచివాలయానికి తాళం

ABN , First Publish Date - 2020-05-27T15:03:01+05:30 IST

మండలంలోని మసీదుపురం గ్రామంలో గ్రామ సచివాలయం మూతపడింది..

అద్దె ఇవ్వలేదని గ్రామ సచివాలయానికి తాళం

మూతపడ్డ మసీదుపురం గ్రామ సచివాలయం


ఎమ్మిగనూరు(కర్నూలు): మండలంలోని మసీదుపురం గ్రామంలో గ్రామ సచివాలయం మూతపడింది. సచివాలయం అద్దె చెల్లించలేదని యజమాని తాళం వేశారు. దీంతో మంగళవారం గ్రామ సచివాలయ అధికారులు కందనాతి గ్రామంలో ఉన్న సచివాలయంలో విధులకు హాజరయ్యారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ సెక్రటరీ తబితను వివరణ కోరగా సచివాలయం ప్రారంభంలో భవనానికి అద్దె కట్టాల్సిన అవసరం లేదన్నారని, ప్రస్తుతం అద్దెను అడుగుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

Updated Date - 2020-05-27T15:03:01+05:30 IST