వాలంటీర్ల మధ్య మాస్క్ వివాదం
ABN , First Publish Date - 2020-04-01T22:02:34+05:30 IST
పుట్లూరు మండలం, నాగిరెడ్డిపల్లి గ్రామంలో రేషన్ షాపు వద్ద..
పుట్లూరు మండలం, నాగిరెడ్డిపల్లి గ్రామంలో రేషన్ షాపు వద్ద బియ్యం వేసే అతను మాస్క్ వేసుకోలేదని వాలంటీర్ పేర్కొంటూ.. మాస్క్ వేసుకోవాలని సూచించడంతో.. మరొక వాలంటీర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు వాలంటీర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో ఒక వాలంటీర్కు చెందిన కుటుంబం వచ్చి మరొక వాలంటీర్ను దుర్భాషలాడుతూ కర్రతో దాడిచేశారు. రేషన్ బియ్యం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు పంపిణీ చేస్తోంది. ఇలాంటి సమయంలో మూడు గంటలపాటు ఆలస్యం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాలంటీర్ల తీరుపై అంతా మండిపడ్డారు.