మున్సిపల్‌ కార్మికులకు మాస్కుల పంపిణీ

ABN , First Publish Date - 2021-05-07T03:49:42+05:30 IST

సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో గురువారం కావలి మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కార్మికులకు ఎన్‌-95 మాస్కులను

మున్సిపల్‌ కార్మికులకు మాస్కుల పంపిణీ

కావలి, మే 6: సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో గురువారం కావలి మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కార్మికులకు ఎన్‌-95 మాస్కులను కమిషనర్‌ బీ. శివారెడ్డి, డీఈ శ్రీనివాసరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ  మున్సిపల్‌ కార్మికులకు మాస్కులు ఇవ్వటం వారి సేవాగుణానికి నిదర్శనమన్నారు. అలాగే కావేరిగుంట గిరిజన కాలనీలో నిరుపేద కుటుంబానికి బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆటోడ్రైవరుగా పనిచేస్తున్న సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపకుడు సురేంద్రను పలు వురు ఆదర్శంగా తీసుకుని ఆపదలో ఉన్న వారికి సేవలను అందించాలని కోరారు. 

Updated Date - 2021-05-07T03:49:42+05:30 IST