విద్యార్థులకు మాస్కుల పంపిణీ

ABN , First Publish Date - 2021-03-03T06:36:34+05:30 IST

రెండు వందల మంది విద్యార్థులకు మంగళవారం జిల్లా దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ కో-ఆర్డినేటర్‌ దార్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మాస్కులు అందజేశారు.

విద్యార్థులకు మాస్కుల పంపిణీ

ముండ్లమూరు, మార్చి 2 : మండల కేంద్రం ముండ్లమూరులోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, వేంపాడు ప్రాథమిక పాఠశాలకు చెందిన  రెండు వందల మంది విద్యార్థులకు మంగళవారం జిల్లా దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ కో-ఆర్డినేటర్‌ దార్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా కేజీబీవీ ప్రత్యేక అధికారి ఆవుల సునీత మాట్లాడుతూ విద్యార్థులకు మాస్క్‌లు అందజేయటం శుభపరిణామం అన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఎలిజిబెత్‌ రాణి, దళిత బహుజన ఫ్రంట్‌ దర్శి నియోజకవర్గ కార్యదర్శి యూ సుబ్బారావు, మండల కార్యదర్శి గోపనబోయిన వెంకటరావు, ఉపాధ్యాయినీలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-03T06:36:34+05:30 IST