మాస్క్ ఉంటేనే బడిలోకి
ABN , First Publish Date - 2021-04-17T05:25:24+05:30 IST
అది వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ హైస్కూల్. స్కూల్లోకి వస్తున్న ప్రతి విద్యార్థిని గేటు వద్దే వ్యాయామ ఉపాధ్యాయులు థర్మల్ స్ర్కీనింగ్ చేస్తున్నారు. మాస్క్ ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు.
వీరవాసరం, ఏప్రిల్ 16 : అది వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ హైస్కూల్. స్కూల్లోకి వస్తున్న ప్రతి విద్యార్థిని గేటు వద్దే వ్యాయామ ఉపాధ్యాయులు థర్మల్ స్ర్కీనింగ్ చేస్తున్నారు. మాస్క్ ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు. లేకుంటే.. వెనక్కి పంపించి పెట్టుకుని రావాల్సిందిగా సూచిస్తున్నారు. అలాగే తరగతి గదుల్లోనూ దూరం దూరంగానే కూర్చునేలా చర్యలు తీసుకున్నారు. కొవిడ్ నిబంధనలపై రోజూ అవగాహన కల్పిస్తున్నారు. 875 మంది విద్యార్థులున్న ఈ స్కూల్లో రోజు 500–600 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ‘బడిలో భయం.. ఏమిటీ నిర్లక్ష్యం’ శీర్షికలతో ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ప్రచురితమైన కథనాలకు జిల్లాలోని చాలా స్కూళ్లల్లో స్పందన కనిపించింది. విద్యార్థికి మాస్క్ ఉంటేనే లోపలికి అనుమతించారు. పలుచోట్ల అధికారులు, పోలీసులు, వైద్యులు పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు.