పరోటా మాస్కులు...ఈ సరికొత్త ప్లాన్ ఎక్కడంటే?
ABN , First Publish Date - 2020-07-10T00:11:37+05:30 IST
ప్రపంచాన్నికరోనా కమ్మేసింది. రికవరీ రేటు పెరుగుతున్నా... రోజురోజుకూ అత్యధికంగా..
ప్రపంచాన్నికరోనా కమ్మేసింది. రికవరీ రేటు పెరుగుతున్నా... రోజురోజుకూ అత్యధికంగా కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజూ 22వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో మాస్క్ తప్పనిసరి పరిస్థితి అయింది. అయినా కొందరు మాస్క్లు ధరించడం లేదు. తమకేమీ కాదంటూ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. అలాంటివాళ్లకు సరికొత్త ప్లాన్తో అవగాహన కల్పిస్తున్నారు. మదురైలోని ఓ రెస్టారెంట్లో వినూత్న ప్రయోగం చేశారు. టెంపుల్ సిటీ రెస్టారెంట్లో మాస్కులను పోలిన పరోటాలు తయారు చేశారు. ఈ పరోటా మాస్కులతో ప్రజల్లో చైతన్యం కల్పించడమే తమ లక్ష్యమని హోటల్ నిర్వాహకులు అంటున్నారు.