వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

ABN , First Publish Date - 2021-09-16T06:58:11+05:30 IST

వైసీపీకి గుడ్‌బై చెప్పి..

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు
టీడీపీలో చేరిన అనంతరం అశోక్‌రెడ్డికి పూలమాల వేస్తున్న కార్యకర్తలు

గిద్దలూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న వలసలు 

అశోక్‌రెడ్డి సమక్షంలో సైకిలెక్కిన 600మంది  


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): గిద్దలూరు నియోజకవర్గంలోని మరో గ్రామంలో వందలాది మంది అధికార వైసీపీకి గుడ్‌బై చెప్పి విపక్ష టీడీపీలో చేరిపోయారు. ఇటీవల కొమరోలు మండలం రాజుపాలెంలో 125కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరగా బుధవారం రాచర్ల మండలం అన్నంపల్లిలో 600 మంది అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి సైకిలెక్కారు. బుధవారం సాయంత్రం ఆ గ్రామంలో జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామానికి చెందిన శిరిగిరి వెంకటపతితోపాటు మరికొందరు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో భారీగా టీడీపీలో చేరారు. ప్రధానంగా కాపు, బోయ, యాదవ సామాజికవర్గాలకు చెందిన వైసీపీ వర్గీయులు పార్టీ మారిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో సభ అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభమైన కొంతసేపటికి ఆ గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి ముగిసిన తర్వాత రావటం చర్చనీయాంశమైంది. 

Updated Date - 2021-09-16T06:58:11+05:30 IST