Breaking : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి..

ABN , First Publish Date - 2021-12-18T20:40:10+05:30 IST

కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి..

Breaking : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి..

కామారెడ్డి : జిల్లాలో పెద్ద కొడపగల్ మండలం జగన్నాథ పల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన క్వాలిస్ వాహనం ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న బాన్సువాడ ఆస్పత్రికి తరలించిన స్థానికులు వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 


స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో మరణించిన వారిని హైదరాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నాందేడ్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



Updated Date - 2021-12-18T20:40:10+05:30 IST