కొండ్రం మందుపాతర ఘటనపై స్పందించిన మావోయిస్టులు

ABN , First Publish Date - 2020-08-11T15:41:15+05:30 IST

విశాఖ: కొండ్రం మందుపాతర ఘటనపై మావోయిస్టులు స్పందించారు. పెదబయలు ఏరియా కమిటీ సుధీర్ పేరిట ఆడియో టెపులను విడుదల చేశారు.

కొండ్రం మందుపాతర ఘటనపై స్పందించిన మావోయిస్టులు

విశాఖ: కొండ్రం మందుపాతర ఘటనపై మావోయిస్టులు స్పందించారు. పెదబయలు ఏరియా కమిటీ సుధీర్ పేరిట ఆడియో టెపులను విడుదల చేశారు. చింతలవీధికి చెందిన ఇద్దరు గిరిజనలు మందు పాతర పేలి మరణంచడం బాధ కలిగించిందన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. పోలీసుల కోసం ఏర్పాటు చేసిన మందుపాతరలో అమాయక గిరిజనులు బలైపోయారన్నారు. దీనిని పోలీసులు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారన్నారు. మావోయిస్టులపై తప్పడు ప్రచారం చేస్తున్నారని.. గిరిజనలతో బలవంతంగా మావోయిస్టు వ్యతిరేక ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు. గిరిజనులకు మావోయిస్టులకు సత్సంబంధాలు ఉన్నాయని.. ఎన్ని కుట్రలు చేసినా గిరిజనలు మావోయిస్టులు వైపే ఉన్నారని సుధీర్ ఆడియో టేపులో పేర్కొన్నారు.

Updated Date - 2020-08-11T15:41:15+05:30 IST