పాదాల పగుళ్లు పోతాయిలా!
ABN , First Publish Date - 2021-09-19T05:30:00+05:30 IST
పాదాల పగుళ్ల సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది.
పాదాల పగుళ్ల సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. అయితే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఏం చేయాలంటే...
రాత్రి పడుకునే ముందు పాదాళ్లను శుభ్రంగా కడిగి పొడి గుడ్డతో తుడవాలి. తరువాత విక్స్ వాపోరబ్ను ఒక లేయర్లా రాయాలి. ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. తరువాత కాటన్ సాక్స్ ధరించి పడుకోవాలి. ఉదయాన గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజూ ఈ చిట్కాను ఫాలో కావచ్చు.
ఒక టబ్లో గోరువెచ్చటి నీళ్లు తీసుకుని ఇరవై నిమిషాల పాటు పాదాలను పెట్టాలి. తరువాత పాదాలు ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక టీస్పూన్ వాజ్లైన్, మూడు నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పాదాల పగుళ్లు ఉన్న చోట రాయాలి. ఉలన్ సాక్స్లు ధరించి పడుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. రోజూ పడుకునే ముందు ఇది ఫాలో అయితే పాదాల పగుళ్లు దూరమవుతాయి.
పాదాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత అరటిపండును గుజ్జుగా చేసి పాదాలపై నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇరవై నిమిషాల పాటు వదిలేసి తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి. ప్రతిరోజు ఇలాచేస్తే రెండు వారాల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. అరటిపండు సహజసిద్ధమైన స్కిన్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది.