ఆలయ అభివృద్ధి పనులపై అలసత్వం వీడండి
ABN , First Publish Date - 2021-10-14T05:49:01+05:30 IST
ఆలయ అభివృద్ధి పనులపై అలసత్వం వీడండి
పనులను సత్వరమే పూర్తి చేయాలి
కలెక్టర్ శశాంక
కురవి, అక్టోబరు 13 : కురవి వీరభద్రస్వామి ఆల యం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితేనే గ్రామాభివృద్ధి వేగవంతమవుతుందని కలెక్టర్ శశాంక అన్నారు. కురవి వీరభద్రస్వామి ఆలయంలో జరుగుతున్న రూ.5కోట్ల పనులను కలెక్టర్కు బుధవారం పరిశీలించారు. పనుల్లో జాప్యంపై కాంట్రాక్టర్ను మందలించారు. ఆలయ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. కల్యాణ కట్ట, అతిథిగృహం సహా రాజగోపురం, ఫ్లోరింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. మొదటగా వీరభద్రస్వామి ఆలయంలో కలెక్టర్ శశాంకకు అర్చకులు పూర్ణకుంభ స్వా గతం పలికారు. వీరభద్రస్వామి, భద్రకాళి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ బి.రామునాయక్, ఆలయ ఈవో సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు నూతక్కి నర్సింహారావు, గుగులోతు రవి, నూతక్కి సాంబశివరావు, ఎంపీటీసీ భాస్కర్, తహసీల్దార్ విజయ్కుమార్,ఎంపీడీవో ధన్సింగ్ పాల్గొన్నారు.