పండుగ పూట విషాదం
ABN , First Publish Date - 2021-10-14T05:50:09+05:30 IST
పండుగ పూట విషాదం
భీమునిపాదంలో నీట మునిగి ఇంటర్ విద్యార్థి మృతి
గూడూరు రూరల్, అక్టోబరు 13 : గూడూరు మండలం సీతానాగారం శివారులో ఉన్న భీమునిపాదం జలపాతంలో బుధవారం సా యంత్రం నీటమునిగి ఇంటర్ విద్యార్థి దిమికి సాయికృష్ణ (18) మృతి చెందాడు. స్నేహితులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నా యి. హన్మకొండ బాలసముద్రానికి చెందిన బ్యాంక్ ఉద్యోగి లక్ష్మయ్య కుమారుడు దిమికి సాయికృష్ణ, కొక్కొండ ఆర్షిత్, అఖిలే్షలు ముగ్గురు కలిసి ద్విచక్రవాహనం ద్వారా భీమునిపాదానికి చేరుకున్నారు. భీమునిపాదంలో జాలువారుతున్న వాటర్పాల్స్ను వీక్షించారు. నీటి ప్రవా హాం ఉన్న ప్రదేశానికి చేరుకుని నీటిలో దిగారు. ఈక్రమంలో సాయికృష్ణ నీటిలో మునిగిపోవడాన్ని ఆర్షిత్, అఖిలే్షలు గమనించారు. పర్యాటకుల సాయంతో మునిగిపోయిన సాయికృష్ణను ఒడ్డుకు చేర్చారు. అక్కడ్నుంచి ద్విచక్ర వాహానం ద్వారా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాయికృష్ణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.