ఎండీహెచ్ అధినేత కన్నుమూత
ABN , First Publish Date - 2020-12-04T06:17:48+05:30 IST
ప్రముఖ మసాలా దినుసుల తయారీ సంస్థ ఎండీహెచ్, యజమాని, మహాషె ధర్మపాల్ గులాటీ (97) ఇక లేరు. ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో ఆయన గురువారం కన్నుమూశారు.
న్యూఢిల్లీ: ప్రముఖ మసాలా దినుసుల తయారీ సంస్థ ఎండీహెచ్, యజమాని, మహాషె ధర్మపాల్ గులాటీ (97) ఇక లేరు. ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో ఆయన గురువారం కన్నుమూశారు. కొవిడ్ నుంచి కోలుకుంటున్న ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. పాకిస్థాన్లోని సియోల్కోట్లో జన్మించిన గులాటీ దేశ విభజన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి శరణార్దిగా వచ్చారు. ఢిల్లీలో కొన్నాళ్లు జట్కా బండి నడిపిన ఆయన తర్వాత తన తండ్రి స్థాపించిన మసాలా దినుసుల తయారీ సంస్థ ఎండీహెచ్ను అతిపెద్ద మసాలా దినుసుల తయారీ సంస్థగా తీర్చిదిద్దారు. వ్యాపార, సామాజిక రంగాల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ప్ర భుత్వం గతఏడాది పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. గులాటీ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.