ఎండియా ఫండ్కు రూ.75 కోట్ల నిధులు
ABN , First Publish Date - 2020-08-11T06:14:36+05:30 IST
హైదరాబాద్కు చెందిన వెంచర్ క్యాపిటల్ కంపెనీ ఎండియా పార్టనర్స్ ఫండ్లో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఐఎ్ఫసీ) రూ.75 కోట్లు...
హైదరాబాద్కు చెందిన వెంచర్ క్యాపిటల్ కంపెనీ ఎండియా పార్టనర్స్ ఫండ్లో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఐఎ్ఫసీ) రూ.75 కోట్లు (దాదాపు 10 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టింది. ఎండియా ఫండ్ 2కి ఐఎ్ఫసీ నిధులు అందించిందని ఎండియా పార్టనర్స్ వ్యవస్థాపకులు ఏ సతీష్, రమేశ్ బైరపనేని తెలిపారు. మేధో సంపత్తి హక్కులున్న ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్న స్టార్టప్ కంపెనీల్లో ఎండియా పార్టనర్స్ సీడ్, ఎర్లీ స్టేజ్ పెట్టుబడులను పెడుతోంది.