కొలువుదీరిన సెస్ పాలకవర్గం
ABN , First Publish Date - 2022-04-20T05:59:39+05:30 IST
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం పాలకవర్గం మంగళవారం కొలువుదీరింది.
- చైర్మన్ ప్రవీణ్, డైరెక్టర్లకు సన్మానం
సిరిసిల్ల, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం పాలకవర్గం మంగళవారం కొలువుదీరింది. సిరిసిల్లలోని ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్గా గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల టౌన్ - 2 డైరెక్టర్గా నంది శంకర్, తంగళ్లపల్లి డైరెక్టర్గా పూసపెల్లి సరస్వతి, ఇల్లంతకుంట డైరెక్టర్గా గుడిసెల అయిలయ్య, గంభీరావుపేట డైరెక్టర్గా గౌరినేని నారాయణరావు, ముస్తాబాద్ డైరెక్టర్గా కొమ్ము బాలయ్య, ఎల్లారెడ్డిపేట డైరెక్టర్గా కుంభాల మల్లారెడ్డి, వీర్నపల్లి డైరెక్టర్గా మాడుగుల మల్లేశం, చందుర్తి డైరెక్టర్గా డప్పుల అశోక్, రుద్రంగి డైరెక్టర్గా ఆకుల గంగారాం, కోనరావుపేట డైరెక్టర్గా దేవరకొండ తిరుపతి, వేములవాడ టౌన్ - 1 డైరెక్టర్గా పోలాస నరేందర్, వేములవాడ టౌన్ - 2 డైరెక్టర్గా రేగులపాటి చరణ్రావు, వేములవాడ రూరల్ డైరెక్టర్గా ఆకుల దేవరాజం, బోయినపల్లి డైరెక్టర్గా మేడుదుల మల్లేశం బాధ్యతలు స్వీకరించారు. వారిని పలువురు అభినందించారు. అంతకుముందు సిరిసిల్ల ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో సెస్ చైర్మన్ గూడూరి ప్రవీణ్తోపాటు డైరెక్టర్ నంది శంకర్ను టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కార్యదర్శి మ్యాన రవి, ఉపాధ్యక్షుడు సంజీవ్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గాజుల నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, ఎండీ సత్తార్, బత్తుల వనజ, దార్నం లక్ష్మీనారాయణ, ఎండీ సలీం, కౌన్సిలర్లు సన్మానించారు.