అనాథ పిల్లల సంరక్షణకు చర్యలు
ABN , First Publish Date - 2021-05-18T05:22:40+05:30 IST
కొవిడ్ నేపథ్యంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిని పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని కలెక్టర్ హరిజవహర్లాల్ చెప్పారు.
కలెక్టరేట్ : కొవిడ్ నేపథ్యంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిని పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని కలెక్టర్ హరిజవహర్లాల్ చెప్పారు. ఈ మేరకు అనాథ పిలల్ల సంరక్షణ కోసం కేటాయించిన ప్రత్యేక వాహనాలను సోమవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ వాహనాల ద్వారా గుర్తించిన పిల్లల సరంక్షణ కోసం విజయనగరం, పార్వతీపురం డివిజన్లలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలోని ఐసీడీఎస్ పీడీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్కు అభినందనలు
జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్ ఎం.హరిజవహర్లాల్ను సోమవారం పలువురు అధికారులు అభినందనలు తెలిపారు. ఈ మేరకు జేసీలు కిషోర్ కుమార్, మహేష్కుమార్, జె.వెంకటరావు, పార్వతీపురం సబ్ కలెక్టర్ విదేఖర్, ఐటీడీఏ పీవో కూర్మనాథ్, డీఆర్వో గణపతిరావు, వివిధ మండలాలకు చెందిన తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు అభినందనలు తెలిపారు.