నేరాల అదుపునకు చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-08-30T06:33:41+05:30 IST
నేరాల అదుపునకు చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
సిరిసిల్ల క్రైం, ఆగస్టు 29: నేరాల అదుపునకు చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు అనిల్కుమార్, మొగిలి, లింగమూర్తి పాల్గొన్నారు.