పారిశుధ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-07-01T10:41:48+05:30 IST

పారిశుధ్యం విషయంలో అలసత్వం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ అన్నారు.

పారిశుధ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు

గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి

కలెక్టర్‌ కర్ణన్‌

ఏన్కూరులో ఆకస్మిక తనిఖీ


ఏన్కూరు, జూన్‌ 30: పారిశుధ్యం విషయంలో అలసత్వం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ అన్నారు. మంగళవారం మండలంలోని నాచారం, రేపల్లెవాడ గ్రామాల్లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. రేపల్లెవాడలోని ఓ ఇంటిలో కూలర్లలో దోమలు ఉండడాన్ని చూసి అక్కడ వార్డు సభ్యుడికి షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని ఎంపీడీవోను ఆదేశించారు. డ్రైడే కార్యక్రమంలో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా భాగస్వాములు కావాలన్నారు. పరిశుభ్ర గురించి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించాలన్నారు.


హరితహారంలో నాటిన మొక్కలకు నీటి వసతి కలిపించి సంరక్షణా బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఒక్క డెంగీ కేసు కూడా నమోదుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కలిగినవారు స్వచ్ఛంధంగా ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలలో పరీక్షలు చేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, అన్నారు. గ్రామాల్లో మిషన్‌భగీరధ నీటి సరఫరాపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీడీవో అశోక్‌, ఈవోఆర్‌డీ వీరస్వామి, సర్పంచ్‌లు విజయకుమారి, రాంబాబు, పంచాయతీ కార్యదర్శి స్నేహలత, పాల్గొన్నారు.

Updated Date - 2020-07-01T10:41:48+05:30 IST