థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు

ABN , First Publish Date - 2021-06-19T05:10:21+05:30 IST

కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీసీహెచ్‌ఎ్‌స సరళమ్మ తెలిపారు.

థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు

 డీసీహెచ్‌ఎ్‌స సరళమ్మ

సత్యవేడు, జూన్‌ 18: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీసీహెచ్‌ఎ్‌స సరళమ్మ తెలిపారు. శుక్రవారం సత్యవేడు కమ్యూనిటీ ఆస్పత్రి, కొవిడ్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు. అనంతరం వైద్యులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ  కరోనా థర్డ్‌వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైద్యులు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. కరోనా చిన్నారుల పాలిట ప్రమాదకరంగా మారనుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయాలని పిలుపు నిచ్చారు.  స్వల్ప, మద్యస్థ లక్షణాల బాధితుల ఆరోగ్య నివేదికలను ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖ ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. తీవ్ర లక్షణాలు ఉన్న వారిని జిల్లా కొవిడ్‌ కేంద్రానికి తరలించాలన్నారు. కార్యక్రమంలో డాక్లర్లు రమేష్‌, ప్రశాంతి, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T05:10:21+05:30 IST