ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు..ఎంపీ సోయం బాపురావు
ABN , First Publish Date - 2020-08-11T10:22:10+05:30 IST
ప్రజా సమస్యల పరిష్కారానికి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ప్రతి శనివారం బస చేయనున్నట్లు
ఆసిఫాబాద్రూరల్, ఆగస్టు10: ప్రజా సమస్యల పరిష్కారానికి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ప్రతి శనివారం బస చేయనున్నట్లు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు పేర్కొన్నారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ తాత్కాలిక కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి శనివారం ఆసిఫాబాద్కు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని సమస్యలను తన దృష్టికి తీసుకు రావాలని ఎంపీ సూచించారు.
అంతకుముందు ఆదిలాబాద్ ఎక్స్రోడ్డు సమీపంలో నిర్మించ తలపెట్టిన బీజేపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం వర్చువల్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ల ప్రసంగాలను వీక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి చాడ శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధ్యక్షులు జేబీ పౌడేల్, మాజీ మంత్రి అమర్సింగ్ తిలావత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోనగిరి సతీష్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొంగ సత్యనారాయణ, అన్నపూర్ణసుదర్శన్గౌడ్, కొట్నాక విజయ్, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఇన్చార్జిలు ఆత్మరాంనాయక్, డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, జడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, జిల్లా మీడియా కన్వీనర్ ఖాండ్రే విశాల్, మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు కుమరం వందన, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సుచిత్, ప్రధాన కార్యదర్శి రమేష్గౌడ్ పాల్గొన్నారు.