మెదక్ జిల్లాలో దొంగల బీభత్సం
ABN , First Publish Date - 2021-09-02T15:23:02+05:30 IST
జిల్లాలోని నర్సాపూర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. పలు ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డ దుండగులు భారీ నగదు, నగలను ఎత్తుకెళ్లారు.
మెదక్: జిల్లాలోని నర్సాపూర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. పలు ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డ దుండగులు భారీ నగదు, నగలను ఎత్తుకెళ్లారు. నర్సాపూర్ పట్టణంలోని పెద్దమ్మ కాలనీలో పరశురాం అనే వక్తి ఇంట్లో రూ.50 వేల నగదుతో పాటు 5 తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. అలాగే సత్యనారాయణ అనే వక్తి ఇంట్లో 4 తులాల బంగారు నగలను దుండుగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.