Telangana: పెరిగిన మంజీరా నది ప్రవాహం
ABN , First Publish Date - 2021-09-08T15:10:14+05:30 IST
సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు ఘనపురం ఆనకట్ట, నిజాం సాగర్లకు నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ప్రవాహం పెరిగింది.
మెదక్: సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు ఘనపురం ఆనకట్ట, నిజాం సాగర్లకు నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ప్రవాహం పెరిగింది. పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గా మాత ఆలయం ముందు నీటి ఉధృతి అధికంగా ఉంది. దీంతో ఆలయాన్ని మూసివేసిన అర్చకులు గాలి గోపురం వద్ద ఉత్సవ విగ్రహానికి నిత్య పూజలు నిర్వహించారు.