రాత్రి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. చివరకు..

ABN , First Publish Date - 2020-12-04T21:38:53+05:30 IST

రాత్రి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. చివరకు..

రాత్రి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. చివరకు..

మెదక్‌ : ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. పట్టణంలోని అల్లాడి బస్తీకి చెందిన అల్లాడి దేవరాజుగురువారం రాత్రి మూత్ర విసర్జనకు ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి రాత్రి 12గంటలైనా ఇంటికి రాకపోవడంతో తెల్లవార్లు కుటుంబీకులు పట్టణ మంతా వెతికారు. ఉదయం పట్టణానికి ఆనుకొని ఉన్న చెరువు వద్ద మృతుడి చెప్పులు, సెల్‌ఫోన్‌ కనిపించాయి. దీంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన రామాయంపేటలోని చోటుచేసుకుంది.  

Updated Date - 2020-12-04T21:38:53+05:30 IST