ఒకపక్క లాక్డౌన్.. మరోపక్క చర్చిలో ప్రార్థనలు
ABN , First Publish Date - 2020-03-29T22:00:48+05:30 IST
మెదక్ జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ చర్చి ఫాదర్ ఇంట్లోనే ప్రార్థనలు నిర్వహించారు.
హైదరాబాద్: మెదక్ జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ చర్చి ఫాదర్ ఇంట్లోనే ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఘటన శంకరంపేట మండలంలోని గవ్వలపల్లిలో చోటు చేసుకుంది. భక్తులను పిలిచి డేనియల్ అనే ఫాదర్ ఇంట్లోనే ప్రార్థనలు చేయిస్తున్నారు. స్థానికుల సమచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న డేనియల్.. భక్తులను గదిలో పెట్టి తాళం వేశాడు. అయితే తాళం తీయించిన పోలీసులు.. భక్తులను బయటకు తీసుకు వచ్చారు. ఫాదర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.