Medak: కల్లు తాగిన 20 మందికి అస్వస్థత
ABN , First Publish Date - 2021-10-31T12:46:45+05:30 IST
కల్లు తాగిన పలువురు అస్వస్థతకు గురవడంతో మెదక్ పట్టణ పరిధిలోని ఆవుసులపల్లిలో కలకలం రేపింది. కాలనీలోని కల్లు దుకాణంలో శనివారం ఉదయం కల్లు సేవించిన 20 మంది కళ్లు తిరిగి పడిపోయారు
మెదక్: కల్లు తాగిన పలువురు అస్వస్థతకు గురవడంతో మెదక్ పట్టణ పరిధిలోని ఆవుసులపల్లిలో కలకలం రేపింది. కాలనీలోని కల్లు దుకాణంలో శనివారం ఉదయం కల్లు సేవించిన 20 మంది కళ్లు తిరిగి పడిపోయారు. వాంతులు, విరేచనాలతో మెదక్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. రోజంతా చిక్సిత పొందిన అనంతరం పరిస్థితి కొంత మెరుగుపడటంతో పలువురు బాధితులు ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇద్దరు బాధితులు మాత్రమే ఇంకా చిక్సిత పొందుతున్నారు. కల్లు తాగిన వారంతా ఆస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. విషయంలో ఎక్సైజ్ సీఐ గోపాల్ నాయక్ను వివరణ కోరగా ఆవుసులపల్లి కల్లు దుకాణం నుంచి నమూనాలను సేకరించి నిజామాబాద్ ల్యాబ్కు పంపినట్టు తెలిపారు. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.