Medakలో వ్యక్తి అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2021-10-12T16:00:43+05:30 IST
జిల్లాలోని చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో దావీదు అనే వ్యక్తి మృతి చెందాడు.
మెదక్: జిల్లాలోని చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో దావీదు అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే పోలీసులు కొట్టడం వల్లే దావీదు మరణించాడని కుటుంబీకులు, బంధువుల ఆందోళనకు దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ట్రాన్స్కో ఉద్యోగిపై దావీదు చేయి చేసుకున్నాడని నాలుగు రోజుల క్రితం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దావీదు మృతికి కారణమైన ఎస్ ఐ సుభాష్పై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.