Medak: జమున హెచరీస్ భూముల సర్వే ప్రారంభం
ABN , First Publish Date - 2021-11-16T16:35:58+05:30 IST
జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేటలో బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ కబ్జా ఆరోపణలపై సర్వే ప్రారంభమైంది.
మెదక్: జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేటలో బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హెచరీస్ కబ్జా ఆరోపణలపై సర్వే ప్రారంభమైంది. మంగళవారం ఉదయం తూప్రాన్ ఆర్డీవో శ్యాం ప్రసాద్, డివిజనల్ సర్వేయర్ లక్ష్మీ సుజాత, తహశీల్దార్ మాలతి ఆధ్వర్యంలో సర్వే మొదలైంది. పోలీసు బందోబస్తు మధ్య భూముల సర్వే జరుగుతోంది.