Medchalలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు స్నేహితులు మృతి

ABN , First Publish Date - 2021-09-04T14:47:49+05:30 IST

జిల్లాలోని దుండిగల్ బౌరంపేట్‌లో శనివారం జరిగిన రోడ్డు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

Medchalలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు స్నేహితులు మృతి

మేడ్చల్: జిల్లాలోని దుండిగల్  బౌరంపేట్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న డీసీఎంను వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు సూరారం నివాసి ప్రమోద్ రెడ్డి(22), వరంగల్‌కు చెందిన సునై రెడ్డి(22)గా గుర్తించారు. సూరారంలో ఉన్న ప్రమోద్ రెడ్డిని కలిసేందుకు వరంగల్ నుండి  సునై రెడ్డి వచ్చాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి 12:00 గంటల సమయంలో అతివేగంగా పల్సర్‌ డ్రైవ్ చేస్తూ ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-09-04T14:47:49+05:30 IST