కరోనా బారిన పడిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ అండ
ABN , First Publish Date - 2020-07-10T01:06:01+05:30 IST
కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ అండగా నిలుస్తుందని అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
హైదరాబాద్: కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ అండగా నిలుస్తుందని అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. వివిధ జిల్లాల్లో గల జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా ఇందులో తాజాగా 21 మందికి పాజిటివ్ వచ్చిందని, మరో ముగ్గురు జర్నలిస్టులు హోంక్వారంటైన్లో ఉండ వలసిందిగా వైద్యాధికారులు సూచించారని చెప్పారు. 21 జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20వేల చొప్పున 4లక్షలు 20వేలు, హోంక్వారంటైన్లో ఉన్న ముగ్గురు జర్నలిస్టులకు 10వేల చొప్పున 30వేల మొత్తం 4లక్షల 50వేల రూపాయల ఆర్దిక సాయాన్ని అల్లం నారాయణ ప్రకటించారు. ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ వచ్చిన 149 మంది జర్నలిస్టులకు 29 లక్షల 80వేల రూపాయలు, హోంక్వారంటైన్లో ఉన్న 72 మంది జర్నలిస్టులకు 7లక్షల 20వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించినట్టు తెలిపారు.
దీంతో మొత్తం 221 మంది జర్నలిస్టులకు 37 లక్షల రూపాయలను మీడియా అకాడమీ నిధుల నుంచి జర్నలిస్టుల ఖాతాలోకి జమచేశామని చెప్పారు. జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ వాట్సప్ నెం. 8096677444 కు తెలియజేయాలని అన్నారు. మరిన్నివివరాలకు మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్కుమార్సెల్ నెం. 9676647807 కు సంప్రదించాలని ఆయన కోరారు. కరోనా బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్లో ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్రిపోర్టులు అకాడమీ కార్యాలయానికి తప్పని సరిగా పంపించాలని సూచించారు.