పేదల కోసమే వైద్య శిబిరం

ABN , First Publish Date - 2021-10-25T04:34:18+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు.

పేదల కోసమే వైద్య శిబిరం
వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న మాజీ మంత్రి చిన్నారెడ్డి

- ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి

శ్రీరంగాపురం, అక్టోబరు 24: కరోనా నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.  మండల కేంద్రంలో జిల్లెల చిన్నారెడ్డి సోదరుడు మాధవరెడ్డి స్మారకార్థం ఆదివారం  వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వైద్యులు జిల్లెల ఆదిత్యరెడ్డి,  శిల్ప, డాక్టర్‌ ప్రశాంత్‌రెడ్డి,  నవీన్‌షేక్‌, రాము  వైద్య సేవలందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్‌, వనపర్తి మునిసిపల్‌ కౌన్సిలర్‌ బ్రహ్మం, జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షుడు గందం రాజశేఖర్‌,  కాంగ్రెస్‌ పార్టీ పెబ్బేరు మండల అధ్యక్షుడు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అక్కల శ్రీనివాస్‌గౌడ్‌, విజయవర్ధన్‌రెడ్డి, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గందం రంజిత్‌కుమార్‌, మండల  అధ్యక్షుడు రాములు యాదవ్‌, ఎంపీటీసీ ఎల్లస్వామియాదవ్‌, దివాకర్‌ యాదవ్‌, రమేష్‌, రాములు, రాజగౌడ్‌, గంగాధర్‌, ఈశ్వరయ్య, గోవిందు, శ్రీధర్‌, నరేందర్‌రెడ్డి, బలరాంనాయక్‌, మండల నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-25T04:34:18+05:30 IST