మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌ సమ్మె విజయవంతం

ABN , First Publish Date - 2022-01-20T05:20:41+05:30 IST

ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ సేల్స్‌ ఇండియా(ఎఫ్‌ఎంఆర్‌ఏఐ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె విజయవంతమైందని రాష్ట్ర అధ్యక్షుడు పి మురళి అన్నారు.

మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌ సమ్మె విజయవంతం
నినాదాలు చేస్తున్న మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌

సుభాష్‌నగర్‌, జనవరి 19: ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ సేల్స్‌ ఇండియా(ఎఫ్‌ఎంఆర్‌ఏఐ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె విజయవంతమైందని రాష్ట్ర అధ్యక్షుడు పి మురళి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేల్స్‌ ప్రమోషన్‌ ఎంప్లాయీస్‌, కండిషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ యాక్ట్‌ 1976ను అమలు చేయాలని, మెడిసిన్‌పై జీఎస్టీ ఎత్తివేయాలని, బడ్జెట్‌లో ఆరోగ్యానికి 5శాతం నిధులు కేటాయించాలని, ప్రభుత్వ రంగ ఫార్మా వ్యాక్సిన్‌ కంపెనీలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, మందులు అమ్మకాలు తగ్గాయనే నెపంతో ఉద్యోగులను తొలగించడాన్ని అడ్డుకోవాలని, ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను నిలిపివేయడంతో పాటు మందుల ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి విద్యాసాగర్‌, కార్యదర్శి డి శ్రీనివాస్‌, కార్యవర్గ సభ్యులు జి శ్రీనివాస్‌, చీకోటి శ్రీధర్‌, జిల్లా అధ్యక్షుడు జేఎల్‌ నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి అకొజు సదానందచారి, ఉపాధ్యక్షులు పబ్బ నరేందర్‌, కందుల శ్రీనివాస్‌, జిల్లా సహాయ కార్యదర్శి కంతాల సంపత్‌రెడ్డి, మిరుపాల అంజయ్య, కోశాధికారి కొండి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T05:20:41+05:30 IST