ఎస్వీయూ తెలుగు విభాగాధిపతిగా మేడిపల్లి రవికుమార్‌

ABN , First Publish Date - 2021-08-01T06:56:54+05:30 IST

ఎస్వీయూ తెలుగు విభాగాధిపతిగా మేడిపల్లి రవికుమార్‌ నియమితులయ్యారు.

ఎస్వీయూ తెలుగు విభాగాధిపతిగా మేడిపల్లి రవికుమార్‌

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జూలై 31: ఎస్వీయూ తెలుగు విభాగాధిపతిగా మేడిపల్లి రవికుమార్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు పనిచేసిన ఆర్‌.రాజేశ్వరమ్మ పదవీకాలం ముగియడంతో ఈస్థానంలో రవికుమార్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్‌ హుస్సేన్‌ ఉత్తర్వులిచ్చారు. సాహిత్య విమర్శ, ఆధునిక కవిత్వం ప్రత్యేక అంశాలుగా అధ్యయనం చేసిన రవికుమార్‌కు 35 ఏళ్ల పరిశోధన, 30 ఏళ్లకుపైగా బోధనానుభవం ఉంది. వీరి పర్యవేక్షణలో సుమారు 20మంది పీహెచ్‌డీలు పొందారు. పలు సాహిత్యాంశాలపై ఐదు పుస్తకాలు రాశారు. గతంలోనూ తెలుగు విభాగ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా, తెలుగు విభాగాధిపతిగా, ఎస్వీయూ అకడమిక్‌ సెనేట్‌ సభ్యులుగా పనిచేశారు. కాగా.. బాధ్యతలు స్వీకరించిన రవికుమార్‌ను శనివారం ప్రొఫెసర్లు రాజేశ్వరమ్మ, కడియాల వెంకటరమణ అభినందించారు. 

Updated Date - 2021-08-01T06:56:54+05:30 IST